తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మరలా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాని యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా కరోనా కేసులు వెలుగు చూశాయి. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నలుగురికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలిపారు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో మూడు కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు సమాచారం. 
 
ముంబాయి నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారికే కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులు కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్ లను గుర్తించే పనిలో పడ్డారు. ఈరోజు సాయంత్రం ఈ కేసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ధృవీకరించనుంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కావడం లేదు. అయితే తాజాగా యాదాద్రి భువనగిరిలో కరోనా నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: