మదర్స్ డే సందర్భంగా ఇప్పుడు ప్రముఖులు అందరూ కూడా జన్మనిచ్చిన తల్లులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. జీవితంలో అమ్మ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుంది అనేది చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాలకుల నుంచి సామాన్యుల వరకు అందరూ కూడా సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. 

 

ప్రజలకు తమ వంతుగా ఏదోక సలహా కూడా ఇస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుని వాళ్లకు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆయన స్వయంగా వివరించారు. తాను అండగా ఉంటా అని హామీ ఇవ్వడమే కాదు లాక్ డౌన్ తర్వాత కార్యక్రమాలను కూడా వారికి ఆయన వివరించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: