ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కరోనా వైరస్ ఊపేస్తుంది. మొత్తం ఆ సంస్థలో దాదాపు 80 మందికి పైగా కరోనా వైరస్ సోకింది. 5 మంది  పైలెట్ లకు కరోనా వైరస్ రాగా వారిని హోం క్వారంటైన్ చేసారు అధికారులు. ఇక మొత్తం వారి నుంచి 77 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తాజాగా మరో ఇద్దరికీ కరోనా సోకింది అని అధికారులు పేర్కొన్నారు. 

 

దీనితో ఇప్పుడు వారితో సంబంధం ఉన్న విమానాశ్రయ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్ చేసారు. ఇక ఎవరైనా ఉన్నతాధికారులకు వారి నుంచి కరోనా వచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనితో ఎయిర్ ఇండియా అప్రమత్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: