గత కొంతకాలం నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి గురించి విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. నిర్మాత దిల్ రాజు ఈ వార్తల గురించి అప్పట్లో స్పందించలేదు. తాజాగా రెండో వివాహం గురించి అధికారికంగా ప్రకటన చేసిన దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని... అందుకు ఇదే మంచి సమయంగా భావిస్తున్నానని చెప్పారు. ఈరోజు దిల్ రాజు సొంతూరైన నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో వివాహం జరగనుంది. 
 
తెలుస్తున్న సమాచారం మేరకు ఆయన కులాంతర వివాహం చేసుకోనున్నారని సమాచారం. వధువు బ్రాహ్మణ యువతి అని... గతంలో ఎయిర్ హోస్టెస్ గా పని చేసిందని తెలుస్తోంది.  వధువుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లాక్ డౌన్ వల్ల హంగూ ఆర్భాటాలు లేకుండానే ఈ వివాహం జరగనుందని సమాచారం. ఈ పెళ్లికి దిల్ రాజుకూతురు హన్షిత రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. 2017లో దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో చనిపోయింది. మాతృ దినోత్సవం సందర్భంగా పెళ్లి చేయాలని భావించి హన్షిత రెడ్డి ఈరోజు పెళ్లి తేదీని ఫిక్స్ చేనట్టు సమాచారం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: