ఇప్పుడు కరోనా బారిన మనం పడకుండా ఉండాలి అంటే కచ్చితంగా మాస్క్ అనేది అవసరం. మాస్క్ లేకుండా కరోనా వైరస్ ని ఎదుర్కోవడం కాస్త కష్టమే. దీనితో ఇప్పుడు అందరూ మాస్క్ ల విషయంలో ఎవరికి తోచిన అవగాహన వారు కల్పిస్తున్నారు. తాజాగా ఒక మటన్ షాపు యజమాని హైదరాబాద్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

తన దగ్గర మటన్ కొన్న వాళ్లకు మాస్క్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముషీరాబాద్‌ శివాలయం చౌరస్తా సమీపంలోని జమల్‌పురి ఆనంద్‌ షాపులో నిన్న మటన్ కొన్న అందరికి ఉచితంగా మాస్క్ లు ఇచ్చారు. సుమారు 300 మందికి మాస్క్ లు అందించారు. భౌతిక దూరం పాటిస్తూనే మటన్ ని అమ్మారు. షాపులో పని చేసే వారికి కూడా మాస్క్ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: