ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంలో అనారోగ్యానికి గురై, మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణి చేస్తుంది. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారి గ్రీష్మ తల్లి తండ్రులకు కోటి రూపాయల చెక్ ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కన్న బాబు పాల్గొన్నారు. 

 

డిశ్చార్జ్ చేసిన వాళ్లకు కూడా పరిహారం వెంటనే ఇస్తామని చెప్పారు. వాలంటీర్ల సహకారం తో బాధితులు అందరికి చెక్ లు అందిస్తామని చెప్పారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేస్తామని మంత్రి కన్న బాబు వివరించారు. కాగా ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిహారం అందించాలి అని ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: