25 మార్గాల్లో విమానాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.  గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ ప్రాంతాల నుంచి విమానాలను నడపాలని భావిస్తుంది కేంద్ర సర్కార్. ఇప్పటికే విమానయాన సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు కూడా వెళ్ళాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. 

 

అటు పౌర విమానయ శాఖ కూడా ఈ విషయంలో సిద్దమవుతున్నట్టు సమాచారం. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల నుంచి విమానాలు వద్దని భావిస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇక విమానాల్లో ఆహారం కూడా అందించడం తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: