ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనా తో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కేసులతో రెండు వేల కేసులు దాటాయి. కాగా ఇప్పుడు ఆస్పత్రుల్లో 975 మంది ఆస్పత్రుల్లో చికిత పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో 9 కేసులు నమోదు కాగా అనంతపురం జిల్లాలో 8 కేసులు నమోదు అయ్యాయి. 

 

మరణాలు ఏమీ నమోదు కాలేదని ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో చెప్పింది. 998 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు జిల్లాలో కూడా 9 కేసులు నమోదు కాగా గుంటూరు 5 కృష్ణా లో 3 కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు 1 విశాఖలో 3 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: