హైదరాబాద్ లో భారీగా స్టైరీన్ గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. సిఎం వైఎస్ జగన్ ఆదేశాలతో నిల్వల వివరాలను అధికారుల బృందం సేకరించింది. విశాఖలోని వివిధ రసాయన పరిశ్రమల్లో దీని వాడకం ఎక్కువగా ఉందని గుర్తించారు అధికారులు. గ్యాస్ నిల్వలను ప్రత్యేక ఓడల ద్వారా తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

కేంద్ర ప్రభుత్వం తో సమన్వయము చేసుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఏయే కంపెనీల్లో దీన్ని వాడుతున్నారు, ఎక్కడ ఎక్కడ ఎంత ఎంత నిల్వలు ఉన్నాయి అనే పక్కా సమాచారాన్ని లెక్కలతో సహా అధికారులు సేకరించారు. అదే విధంగా నిల్వలను ఏ విధంగా భద్ర పరుస్తున్నారు అనే దాని మీద కూడా అధికారులు ఆరా తీసారు. కాగా విశాఖలో ఇటీవల గ్యాస్ లీక్ అయి 12 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: