ఈ మధ్య సెల్ ఫోన్ పేలుతున్న ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. చార్జింగ్ పెట్టిన తర్వాత అవి పేలడం వంటివి జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న తక్కువ రేట్ మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టే సమయంలో పేలడం ఆందోళన కలిగిస్తుంది.  తాజాగా తెలంగాణాలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

 

అది ఏంటీ అంటే మొబైల్ కి చార్జింగ్ పెడుతున్న సమయంలో షాక్ కొట్టి మేకల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపెల్లి గ్రామానికి చెందిన మేకల అంజయ్య తన మొబైల్ లో ఛార్జింగ్ అయిపోవడంతో కేబుల్ తో పిన్ పెట్టాడు. ఈ క్రమంలో షాక్ కొట్టి అంజయ్య అక్కడిక్కడే మరణించారు. అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. అతని వయసు 45 ఏళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: