లాక్ డౌన్ తో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం లో ఒక హత్య అలజడి సృష్టించింది. జగద్గిరి గుట్టలోని ఆర్పీ కాలనీలో ఒక యువకుడిని వెంటాడి చంపారు అతని ప్రత్యర్ధులు. యువకుడిని కత్తులతో తరుముతూ హత్య చేసారు. మృతుడు రౌడీ షీటర్ ఫయాజ్ అని పోలీసులు గుర్తించారు. 

 

ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. అతనిని చంపడానికి పాత కక్షలు ఏమైనా కారణమా అని విచారణ చేస్తున్నారు పోలీసులు. అతన్ని పది మంది వెంటాడుతూ కత్తులతో నరికి చంపారు. కాలనీ లోని యువకులే అతన్ని చంపారు అని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: