కరోనాపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కోవిడ్ రికవరీ రేటు 31.15 శాతం ఉందని ఆయన చెప్పారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతామని చెప్పారు. రేపటి నుంచి రైలు ప్రయాణాలు చేసే వారు స్టేషన్ కి వెళ్ళాలి అని, టికెట్ ఖరారు అయిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అని సూచించారు. 

 

రైల్వే ప్రయాణికులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి అని ఆయన సూచించారు. వలస కార్మికుల కోసం 428 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నామని ఆయన చెప్పారు. వలస కార్మికులు ఆవేదన చెందవద్దు అని ఆయన సూచించారు. ఇక గత 24 గంటల్లో 559 కోలుకున్నారని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: