టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనాను వదిలేసి కరెంట్ చార్జీలను వసూలు చేయడం మీద దృష్టి పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. విజయసాయి రెడ్డి గబ్బిలం లా విశాఖను పట్టుకుని వేలాడుతున్నారు అని చంద్రబాబుకి టీడీపీ నేతలు తెలియజేసారు. 

 

అదే విధంగా బాధితులు, టీడీపీ నేతలు, ప్రతిపక్షాల మీద ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేసారు. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే ఎదురు దాడి చేయడం, దూషణలకు దిగడం పరిపాటి గా మార్చుకున్నారని, విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నారు అని మండిపడ్డారు. విశాఖ ఘటన లో బాధిత మహిళపై కేసు పెట్టడం దారుణమని అన్నారు. వైసీపీ నేతలు సమస్యలను సృష్టించడమే పని గా పెట్టుకున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: