లాక్ డౌన్ సమయంలో ఒక పక్క జనాలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి ఇప్పుడు. కొంత మంది లోన్ లు ఆఫర్లు చేయడం, గిఫ్ట్ లు ఆఫర్ చేయడం వంటివి చేస్తున్నారు. దీనితో నమ్మి కొంత మంది తప్పులో కాలు వేస్తున్నారు. 

 

తాజాగా ఒక ఆర్మీ జవాన్ ఇదే చేసాడు హైదరాబాద్ లో. బజాజ్ ఫైనాన్స్ నుంచి తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఇస్తామని ఒక బ్యాచ్ ఫోన్ చేసింది. ముందుగా ప్రాసెసింగ్ చార్జీ గానూ 4 లక్షలను కట్టాలి అని సూచనలు చేయడం తో నమ్మి కట్టిన ఆర్మీ జవాన్ అశ్విన్ ఖాతా నుంచి 4 లక్షలు మాయం అయ్యాయి. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: