దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి కాటేస్తుంటే.. మరోవైపు బంధాలు అనుబంధాలకు చరమగీతం పాడుతున్నారు కొంతమంది కఠినాత్ములు. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు దారుణంగా చంపుకుంటు భర్యాభర్తల అనుబంధాలకే మచ్చతెస్తున్నారు. పెద్దల సమక్షంలో మాంగళ్య బంధంతో ఒక్కటైన జంట కొంత కాలం హాయిగా కాపురం చేసుకొని తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోతున్నారు. కొంత మంది హత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని పోలీసు శాఖ వారు చెబుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మంధర్నా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను చంపి మంజీర నదిలో పాతిపెట్టింది. రెండు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె చేసిన పనికి ఆ గ్రామస్థులు ఒక్కసారే ఖంగు తిన్నారు.. గత కొంత కాలంగా భార్యభర్తల మద్య విభేదాలు రావడం.. గొడవలు ఇందుకు కారణమా లేదా ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అన్న కోనం లో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.