లాక్ డౌన్ లో మద్యం అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు దీనిలో భాగం కావడం తో ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరిస్తుంది. వాళ్ళను ఏ విధంగా కూడా క్షమించవద్దని సిఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. 

 

తాజాగా విజయవాడలో ముగ్గురు పోలీసు అధికారులు మద్యాన్ని అక్రమంగా లాక్ డౌన్ నిభంధనలను ఉల్లంఘించి దాచుకున్నారు. దీనితో ఇతర అధికారులకు సమాచారం అందింది. ఎస్సై ప్రకాష్ ని విచారణ చేయమని చెప్పగా ఆయన విచారణ చేసి వాళ్ళను వదిలేసారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడం తో ఇద్దరు కానిస్టేబుల్స్ ని ఎస్సై ప్రకాష్ ని సస్పెండ్ చేసారు. ఈ ఘటన కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: