ఇప్పుడు కరోనా వైరస్ సోకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అది ఏ రూపంలో వచ్చి దాడి చేస్తుందో కూడా అంచనా వేయడం చాలా కష్టం ప్రస్తుత పరిస్థితుల్లో. ప్రస్తుతం కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రతీ చిన్న జాగ్రత్తను తీసుకుంటున్నారు. కరెన్సీ నోట్ల నుంచి కూడా ఇప్పుడు కరోనా సోకుతుంది. 

 

దీనితో కరెన్సీ నోట్ల వాడకం భారిగా తగ్గింది. ఈ నేపధ్యంలో భోపాల్ పోలీసులు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారి నుంచి డబ్బులను వెంటనే తీసుకుంటున్నారు. కాని ఇప్పుడు భోపాల్ లో మాత్రం చలానా వేసిన తర్వాత వారు ఇచ్చే నోట్లను శానిటైజ్ చేసిన తర్వాత తీసుకుంటున్నారు. చివరికి పెన్నుని కూడా అలాగే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: