లాక్ డౌన్ ని కొనసాగించడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొగ్గు చూపిస్తున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా ఏపీ సర్కార్ చాలా వరకు నష్టపోయింది అనేది వాస్తవం. లాక్ డౌన్ ని కొనసాగిస్తే ఏపీ సర్కార్ ఇంకా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. 

 

దీనితో జగన్ ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఇక కంటైన్మేంట్ జోన్ లో మాత్రమే లాక్ డౌన్ ఉండాలని ఆయన భావిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పూర్తి గా సడలించాలి అని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆయన కేంద్రానికి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో జగన్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: