విశాఖలో పరిస్థితి సాధారణ స్థితి లోనే ఉందని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన విశాఖ పర్యటనకు వెళ్లి గ్యాస్ లీక్ అయిన ప్రాంతాల్లో మంత్రులతో కలిసి బస చేసారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను ఆయన అధికారులను అడిగి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసారు.

 

ప్రస్తుతం అక్కడ నీటిని పరిక్షీస్తున్నామని చెప్పారు విజయసాయి రెడ్డి. పరిస్థితి గురించి ఆందోళన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం జనావాసాలకు అనుకూలమా కాదా అనేది హైపవర్ కమిటి చెప్తుందని రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. అక్కడి నీటిని కూడా పరిక్షలు చేస్తున్నారు అని ఈ సందర్భంగా విజయసాయి అన్నారు. వాలంటీర్లు నేటి నుంచి ఇంటింటి సర్వే చేస్తారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: