భారత్ లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3604 కేసులు నమోదు అయ్యాయి. దీనితో కరోన కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో కరోన కేసుల సంఖ్య 70 వేల 756 గా ఉంది. ఇక మరణాలు కూడా పెరుగుతున్నాయి. 

 

ఇప్పటి వరకు 2293 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాసేపటి క్రితం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 46008 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. 22454 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని కేంద్రం పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లో భారీగా కరోనా కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: