పంజాబ్ నేషనల్ బ్యాంకుని నిండా ముంచేసిన నగల వ్యాపారి నీరవ్ మోడిని భారత్ కి బ్రిటన్ అప్పగించిన తర్వాత ఎక్కడ ఉంచాలి అనే దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆయనను ఉంచడానికి ఇప్పుడు అధికారులు సిద్దమయ్యారు. ఆయనను ముంబై ఆర్డర్ రోడ్ జైల్లోని 12 వ నెంబర్ బ్యారేక్ లో ఉంచుతున్నట్టు తెలుస్తుంది. 

 

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆయన్ను భారత్ కి తీసుకొచ్చిన తర్వాత విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆయనను భారత్ కి అప్పగించడం కోసం గత 5 రోజులు గా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన లండన్ లోని ఒక జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎప్పుడు భారత్ కి వస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: