ప్రపంచంలో ఇప్పుడు టిక్ టాక్ కి ఉన్న గిరాకి అంతా ఇంతా కాదు. పల్లె నుంచి పట్టణాల వరకు చిన్న నుంచి ముదుసలి వరకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ టిక్ టాక్ చేస్తూ వినోదాన్ని పంచుతున్నారు.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో రోజూ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ టిక్ టాక్ ల వరకు ఎంత వినోదం ఉందో అంతే విషాదాలు కూడా ఉన్నాయి. కొంత మంది టిక్ టాక్ చేయడం కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో ఇద్ద‌రు షార్ప్ షూట‌ర్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ స్టార్, జిమ్ ట్రెయిన‌ర్ అయిన మోహిత్ మోర్ హ‌త్య కేసులో వీరు నిందితులుగా ఉన్న వారిని ఢిల్లీ స్పెష‌ల్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

టిక్‌టాక్ స్టార్ మోహిత్ మోర్  ఎంతో పాపులర్ అయ్యారు.  గ‌త ఏడాది న‌జ‌ఫ్‌గ‌డ్‌లోని ధ‌రంపుర ప్రాంతంలో ముగ్గురు దుండ‌గులు ముఖాల‌కు మాస్కుల‌తో వ‌చ్చి మోహిత్ మోర్‌ను అతి స‌మీపం నుంచి కాల్చిచంపారు.  పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని నిందితుల్లో ఒక మైనర్ ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మిగ‌తా ఇద్ద‌రి కోసం గాలింపులు చేప‌ట్టి ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: