ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ సడలింపుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటానికి ఏపీ సర్కార్ సిద్దమైంది. తాజాగా లాక్ డౌన్ లో ప్రజలకు వెసులు బాటు ఉండే విధంగా నిత్యావసర సరుకులకు సంబంధించి సమయాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది. 

 

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలను తెరిచి ఉంచాలని ఏపీ సర్కార్ సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడా కూడా ప్రజలు నిత్యావసర సరకుల కోసం ఇబ్బంది పడకూడదు అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు సిఎం వైఎస్ జగన్. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని సడలింపులు ఉండే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: