సాయంత్రం 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. లాక్ డౌన్ ని పెంచడం పై సాయంత్రం ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. దీని తో దేశ వ్యాప్తంగా ఆయన ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. లాక్ డౌన్ సడలింపులపై ఆయన ప్రకటన చేసే సూచనలు ఉన్నాయి. 

 

నిన్న సిఎం లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ల సందర్భంగా ఆయన నుంచి కూడా లాక్ డౌన్ ని పెంచడం పైనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం.  ఇక మరిన్ని సడలింపులు ఇవ్వడమే కాకుండా గ్రీన్ జోన్ లో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసే ఆలోచనలో మోడీ ఉన్నారని తెలుస్తుంది. ఆయన ప్రసంగంలో ఇదే హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, విమాన ప్రయాణాలను కూడా అనుమతించే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: