ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో లాక్ డౌన్ ని ఏపీ సర్కార్ పెంచడం పైనే ఆసక్తి చూపిస్తుంది. ఇక కృష్ణా జిల్లా నూజివీడు లో ఇప్పుడు లాక్ డౌన్ ని జూన్ 8 వరకు పెంచారు. 

 

సోమవారం నుంచి జూన్ 8 వరకు కఠిన ఆంక్షలు అమలు చేస్తారు అధికారులు. ఈ విషయాన్ని ఎమ్మార్వో సురేష్ మీడియా కు వివరించారు. దీనికి కారణం ఇటీవల నూజివీడు లో ఒక మహిళకు కరోన వచ్చింది. ఆమె తో చాలా మందికి లింక్ లు ఉన్నాయని తెలియడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. నిత్యావసర సరుకులను ఉదయం 6  గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: