తెలుగు ఇండస్ట్రీలో అంతమైన యంగ్ కపుల్స్ ఎవరంటే వెంటనే చైతూ-సమంత ల గురించే చెబుతారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేసావే’ చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఈ జంట లవ్ లో పడ్డారు. మనం చిత్రం తర్వాత పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయల ప్రకారం ఒక్కటయ్యారు. పెళ్లైన తర్వాత సమంత ఇంటికే పరిమితం అవుతుందని భావించారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లైన తర్వాతనే సమంతకు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటుంది. ఇక చైతూ కూడా మజిలి, వెంకిమామతో మంచి హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ‘లవ్ స్టోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా ఇక సమంతస సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ చిత్రం తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలో ఈ ఫోటోకు 10 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. అంతలా ఈ ఫోటోలో ఏముందని అనుకుంటున్నారా? పెద్దగా ఏమీ లేదు. దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ పాత ఫోటోకు సమంత యునీక్ గా క్యాప్షన్ తగిలించడమే దీన్ని వైరల్ చేసింది. `దాదాపు ఓ గొప్ప సాహసయాత్రకు సిద్దమవుతున్నాం` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో అక్కినేని అభిమానులతో పాటు సమంత అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.