భార‌త‌ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం డిశ్చార్జ్‌ అయ్యారు. అనారోగ్యానికి గురికావ‌డంతో ఆదివారం రాత్రి మన్మోహన్‌సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మన్మోహన్‌సింగ్‌కు కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈప‌రీక్ష‌ల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చిందన్నారు.

 

పూర్తిగా కోలుకున్న మన్మోహన్‌ సింగ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఆస్ప‌త్రి నుంచి క్షేమంగా మ‌న్మోహ‌న్‌సింగ్ తిరిగి ఇంటికి చేరుకోవ‌డంతో కుటుంబ స‌భ్యులు, పార్టీ నేత‌లు, నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానిగా మ‌న్మోహ‌న్‌సింగ్ త‌న‌దైన పాల‌న‌తో ప్ర‌జాసంక్షేమం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించారు. కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా కొన‌సాగుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: