వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. ఎల్జీ పాలీమర్స్ బాధితులకు న్యాయ౦ జరిగే వరకు టీడీపీ పోరాట౦ చేస్తుందని అన్నారు. బాధితులకు భరోసా ఇవ్వాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. 

 

ఇక మహానాడు ఏర్పాట్లపై కూడా చంద్రబాబు చర్చించారు. జూమ్ యాప్ ద్వారా దీనిని నిర్వహించాలని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించగా దానికి సీనియర్ నేతలు ఓకే చెప్పారు. దీనితో ఈ నెల చివర్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించే సూచనలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: