విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం ఇప్పట్లో చల్లబడే విధంగా కనపడటం లేదు. బాధితులకు నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం అన్ని విధాలు గా అండగా ఉన్నా సరే అక్కడి ప్రజలు మాత్రం ఆందోళన విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రతీ రోజు కూడా ఏదోక వివాదం బయటకు వస్తూనే ఉంది విశాఖలో. 

 

తాజాగా విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులకు చికిత్స పూర్తి అయింది. వారిని గ్రామాలకు తరలించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ సమయంలో తమకు పరిహారం వద్దని తమకు హెల్త్ కార్డులు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరిది బాధ్యత అని నిలదీస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: