శ్రీశైలం జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది శ్రీశైలం జలాలను వాడుకోవడంలో ఏకపక్షంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణా లో ఇప్పుడు అధికార విపక్షాలు జగన్ సర్కార్ ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 

 

జగన్ సర్కార్ నిర్ణయంపై అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజెపి సహా ఇతర పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇక తెలంగాణా బిజెపి ఇప్పుడు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్ష చేయడానికి సిద్దమైంది. నాంపల్లి పార్టీ ఆఫీస్ లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తారు. జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: