దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నాలుగు నెలలుగా మనం కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 42 లక్షల మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు 2 లక్షల 88 వేల మంది కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రాణాల కోసం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. 

 

మనం ధృడమైన సంకల్పం తో ముందుకి వెళ్ళాలి అని ఆయన ఆకాంక్షించారు. కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాపించింది అని మోడీ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంక్షోభం కనివినీ ఎరుగనిది అని మోడీ అన్నారు. కాని మనిషి ఓడిపోవడానికి సిద్దంగా లేదని చెప్పారు. మనం బలంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: