21వ శతాబ్దం భారత్ దే అని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేసారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఆత్మ నిర్భార్ భారత్ మన లక్ష్యం అని మోడీ పేర్కొన్నారు. ప్రతీ రోజు రెండు లక్షల పీపీఈలు ఎన్ 95 మాస్క్ లను తయారు చేస్తున్నామని మోడీ వివరించారు. 

 

ఈ వైరస్ నుంచి మనం మనని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఆయన సూచించారు. ఆత్మ స్థైర్యం కలిగిన భారత్ అనేదే మన మార్గం అని మోడీ పేర్కొన్నారు. ఈ సంక్షోభం మొదలైనప్పుడు భారత్ లో పీపీఈ కిట్స్ ఉత్పత్తి లేదని వాటిని ఇప్పుడు భారీగా ఉత్పత్తి చేస్తున్నామని మోడీ వ్యాఖ్యానించారు. చావు బతుకల మద్యం మనం పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. భారత్ పురోగతే ప్రపంచం పురోగతి అని మోడీ ఈ సందర్భంగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: