తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న 79 కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు 51 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1326కు చేరింది. ఈరోజు నమోదైన కేసులలో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు 21 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో కొత్త మరణాలు నమోదు కాలేదు. కానీ గత 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందటంతో మృతుల సంఖ్య 32 కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: