సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో పంచుతున్న హాస్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సహా పలు రాష్ట్రాల్లో కరెంట్ బిల్ తీవ్రంగా వస్తుంది. పదుల్లో వచ్చే వాళ్లకు వందల్లో.. వందల్లో వచ్చే వాళ్లకు వేలల్లో వస్తుంది కరెంట్ బిల్. దీనిపై ప్రజల్లో ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంది. 

 

దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా కామెంట్స్ వస్తున్నాయి. అది ఏంటీ అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో... క్లైమాక్స్ సన్నివేశంలో.. ఉపేంద్ర అల్లు అర్జున్ ఎదురు పడిన సందర్భంలో... ఆస్తి పత్రాలు ఇచ్చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో మీకు కరెంట్ బిల్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అని ఉపేంద్ర అల్లు అర్జున్ చేతిలో పత్రాలు పెట్టేస్తాడు. ఇక మిగిలింది నా ఆస్తి పేపర్లుమాత్రమే.. ఇవి తీసుకోండి నేను అడవుల్లోకి వెళ్ళిపోతా అని ఫోటో ని ఎడిట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: