ఈ కరోనా తీవ్రత నేపధ్యంలో జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే సామాజిక దూరం అనేది పాటించాలి. లేకపోతే కరోనా వైరస్ కచ్చితంగా సోకుతుంది. దీనితో జనాలు ఎంత అవసరం ఉన్నా సరే ఏ మాత్రం కంగారు పడకుండా జాగ్రత్తగా ఇప్పుడు సామాజిక దూరం పాటిస్తున్నారు. బ్యాంకు లు అయినా నిత్యావసర సరుకులు అయినా ఏది అయినా సరే సామాజిక దూరం పాటిస్తున్నారు. 

 

తాజాగా బ్యాంకు వద్ద సామాజిక దూరం పాటిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ గొడుగులు పట్టుకుని కూర్చున్నారు. దీనితో బీచ్ అనుకున్నారు గాని అది బ్యాంకు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌లోని ఓ బ్యాంకు వద్ద భౌతిక దూరం పాటించడానికి గొడుగులు ఏర్పాటు చేసారు. మంగళవారం ఈ దృశ్యం కనపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: