టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం గత ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్పల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా దిల్ రాజు పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా, ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న అమ్మాయి పేరు తేజస్విని అలియాస్ వైఘా రెడ్డి. దగ్గరి బంధువులకి సంబంధించిన అమ్మాయి అని కొందరు అంటుండగా, మరి కొందరు బ్రాహ్మణ యువతి అని చెప్పుకొస్తున్నారు.
ఇక ఇదే సమయంలో ఈ జంట మాత్రం చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్స్ అంటున్నారు. ఇక తాజా విషయం ఏమిటంటే.. భార్యతో కలిసి దిల్ రాజు దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. వివాహం అనంతరం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇదే మొదటిదని అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత.. 2017 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే.