ఒక పక్క కరోనా వైరస్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ సర్కార్ చూపిస్తున్న దూకుడుపై ఇప్పుడు తెలంగాణ  ఆగ్రహం గా ఉంది. ఇప్పటికే కృష్ణ బోర్డ్ కి తెలంగాణా సర్కార్ ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే.

 

ఇక ఇప్పుడు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్ళాలి అని భావిస్తుంది. సుప్రీం కోర్ట్ లో ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 203 ని సవాల్ చేయనుంది తెలంగాణా ప్రభుత్వం. తమకు నీళ్ళల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పాలకులు అన్యాయం చేసారు అని ఇప్పుడు కూడా అదే అన్యాయం జరుగుతుంది అని తెలంగాణా ఆరోపణలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: