ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా.. దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గానూ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ని ప్రకటించారు. ఈ వివరాలను కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారు అని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 

ఈ నేపధ్యంలో సాయంత్రం 4 గంటలకు నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చి దీనిపై ప్రకటన చేస్తారు. దీనితో నిర్మలమ్మ తాయిలాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ప్రకటనపై ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏయే వర్గాలకు ఎంత ఎంత అనేది ఆమె వివరాలను వెల్లడిస్తారు. ముఖ్యంగా ఆమె ప్రకటన పై మధ్యతరగతి, కింది స్థాయి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: