ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య జల జగడం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న తెలంగాణా సర్కార్ ఇప్పుడు జీవో ని వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తుంది. ఇక అక్కడి అధికార విపక్షాలు కూడా ఈ విషయంలో ఏపీ మీద మండిపడుతున్నారు.
ఈ తరుణంలో తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రగతి భవన్లో తయారైన జీవోను ఏపీలో విడుదల చేశారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, జగన్ను విడదీసి చూడలేమన్నారు. విస్కీ, సోడాలా కలిసిపోయారని ఎద్దేవా చేసారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కాగా తెలంగాణా సర్కార్ కృష్ణా యాజమాన్య బోర్డ్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.