కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజి వివరాలను ఆమె ఈ సందర్భంగా వివరించారు. 20 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రధాని మోడీ ప్రకటించారని, స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకెజీ ప్రకటించారని అన్నారు. 

 

నిన్న ప్రధాని మార్గ నిర్దేశనం చేసారని ఆమె పేర్కొన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చిన తర్వాత ప్యాకేజి ని నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. అందరి తో మాట్లాడి రూప కల్పనా చేసారని అన్నారు. ఈ ప్యాకేజ్ దేశ ఆర్ధిక వ్యవస్థకు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజలకు కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె వివరించారు. లోకల్ బ్రాండ్స్ ని అభివృద్ధి చెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: