కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి కి సంబంధించిన వివరాలను ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. 5 సూత్రాలతో భారీ ప్యాకేజి ప్రకటించామని అన్నారు. ఆర్ధిక మౌలిక సాంకేతికత, దేశ జనాభా, డిమాండ్ ఆధారంగా ప్యాకేజి ప్రకటించామని చెప్పారు. 

 

నవ భారత నిర్మాణమే ఆత్మ నిర్భర భారత్ అభియాన్ లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్ళలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ప్రధాని ఒక సమగ్రమైన సూచనలను దేశం ముందు ఉంచారని, ముందు చూపుతో ప్యాకేజి ప్రకటించామని ఆమె అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ తమ మేలిమి ఉదాహరణ అని నిర్మల పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: