ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు తెలిపారు. 50 వేల కోట్లతో ఎంఎస్ఎంఈ లకు నిధి ఏర్పాటు. ఇవాల్టి నుంచి ప్యాకేజీ వివరాల్ని ఒక్కొక్కటిగా ప్రకటిస్తాం అన్నారు. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఇవాల 15 చర్యల్ని ప్రకటిస్తున్నాం.
ఎంఎస్ఎంఈ లకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం. ఎంఎస్ఎంఈ రూ. 3 లక్షల కోట్ల రుణాలు. చిన్న, మద్య తరహా పరిశ్రమల కోసం మూడు లక్షల కోట్ల రుణాలు. ఎలాంటి పూచికత్తు లేకుండా ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరు అని నిర్మలా సీతారామన్ తెలిపారు.