ఒక పక్క లాక్ డౌన్ కఠినం గా అమలు చేస్తున్నా సరే కొందరు మాత్రం చేసేది చేస్తున్నారు. తాజాగా మీడియా పేరు చెప్పి ఒక వ్యక్తి లాక్ డౌన్ లో మద్యం మాంసం తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసారు. గతంలో మీడియాలో పనిచేసిన ఎన్‌.వెంకటముని ఇండికా వాహనంలో మద్యం, మాంసం నింపుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నాడు. 

 

తిరుపతి నుంచి తిరుమలకు దీనిని తరలిస్తూ ఉండగా వాహనం అనుమానాస్పదంగా ఉండటంతో అలిపిరి చెక్ పోస్ట్ లో ఏవీఎస్‌వో సురేంద్ర ఆధ్వర్యంలో విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీలు చేసారు. వాహనంలోని సీటు కింది భాగంలో ఉంచిన మద్యం మాంసం గుర్తించడం తో అతని వాహనాన్ని సీజ్ చేసారు. కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఎవరి కోసం తరలిస్తున్నాడు అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: