దేశ వ్యాప్తంగా వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. లక్షల మంది వలస కూలీలు సొంత ఊర్లకు నడిచి వెళ్తున్నారు. రోజు రోజుకి రోడ్ల మీద వీరి సంఖ్య భారీగా పెరుగుతుంది. వారిని ఎన్ని విధాలుగా కట్టడి చేసి ఉంచాలి అని ప్రభుత్వాలు భావిస్తున్నా వాళ్ళు మాత్రం సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. 

 

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో   ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. నడిచి వెళ్తున్న వలస కూలీల మీద ఒక బస్సు దూసుకుని వెళ్ళడం తో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: