దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. నిమిష నిమిషానికి గంట గంటకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 13 రోజులు గా భారీగా పెరిగిన కరోనా కేసులు నేడు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యాయి. 24 గంటల్లో దాదాపు 4 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసుల సంఖ్య 78 వేలు దాటింది. 

 

24 గంటల్లో కరోనా 3722 మందికి సోకింది. రికార్డ్ స్థాయిలో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 78,003 గా ఉంది. ప్రస్తుతం దేశంలో 49219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2549 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 26 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: