హైదరాబాద్ లో అడవి జంతువులు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. అడవి జంతువుల దెబ్బకు ఇప్పుడు జనాలు భయపడిపోతున్నారు. మైలార్ దేవి పల్లి లో జాతీయ రహదారి మీద చిరుత కలకలం సృష్టించింది. దానిని పట్టుకోవడానికి గానూ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అది రోడ్డు మీద తీవ్ర గాయాలతో ఉంది. 

 

ఇక తాజాగా గోల్కొండ ఫతే దర్వాజ దగ్గర నల్ల గండు పిల్లి ఒకటి కలకలం సృష్టించింది. దానిని చూసిన జనాలు నల్ల చిరుత అని కంగారు పడ్డారు. వెంటనే మసీదు ని మూసి వేసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆ గండు పిల్లిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు భయపడవద్దని అది చిరుత కాదని చెప్పారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: