తన కడుపు నింపుతున్న గేదె ను కాపాడబోయి ఒక వృద్దురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు లోని తంజావూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కనాడు కీళయూర్‌ దక్షిణ వీధికి చెందిన సరోజ మేత కోసం తన గేదెలను పొలానికి తోలుకుని వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ గేదెకు కరెంట్ షాక్ కొట్టడం తో గేదె కొట్టుకుంటుంది. 

 

దీనిని గమనించిన సరోజ వెంటనే అప్రమత్తమై గేదె మీద పడిన కరెంట్ తీగను తీయడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయింది సరోజా. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనలో మరణించిన ఆమెకు గేదెకు పరిహారం అందేలా చూస్తామని అధికారులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: