ఇప్పుడు కరోనా ఎంతో మందిని అనాధలను చేస్తున్న సంగతి తెలిసిందే. వేలాది మంది పిల్లలు తల్లి తండ్రులను కూడా కోల్పోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో కరోనా సోకి తండ్రి చనిపోగా... చిన్నారి క్వారంటైన్ లో ఉన్నారు. ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్న చిన్నారి అనాధ గా మారిపోయాడు. గోరేగావ్ ఈస్ట్‌కు చెందిన 11 ఏళ్ల హర్షిల్ సింగ్ ఇప్పుడు అనాథ గా బ్రతుకుతున్నాడు. తండ్రి కరోనా కారణంగా ఏప్రిల్ 13 న మరణించాడు. 

 

తల్లికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెను క్వారంటైన్ కి పంపించారు. హర్షిల్ కు నెగటివ్ వచ్చింది. తల్లి క్వారంటైన్ లో ఉండగా ఆ చిన్నారి హోం క్వారంటైన్ లో ఉన్నాడు. అతన్ని చూసే వారు ఎవరూ లేరు. దీనితో మాజీ సైనిక అధికారి ఒకరు చిన్నారికి సహాయం అందిస్తున్నారు. రాత్రి ఒంటరి గా ఉన్న సమయంలో వారి బంధువులు ఫోన్ లు చేసి మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: