ఆంధ్రప్రదేశ్ కరోనా హెల్త్ బులిటెన్ ని ఏపీ సర్కార్ విడుదల చేసింది. ఏపీలో గత 24 గంటల్లో 36 కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో కరోనా కేసుల సంఖ్య 2100 కి చేరింది. నేడు నమోదు అయిన కేసుల్లో ఎక్కువగా కోయంబేడు లింక్ లు ఉన్నాయని తెలుస్తుంది. 

 

48 మంది కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 9, గుంటూరు 5, కృష్ణా కడప 2, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ఒక కేసు నమోదు అయింది. యాక్టివ్ కేసులు 860 గా ఉన్నాయి. నెల్లూరు లో ఇవాళ ఒక్క రోజే 15 కేసులు నమోదు అయ్యాయి. వీటిల్లో కోయంబేడు లింక్ లు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: