కరోనా మహమ్మారి విజృంభించడంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించించింది. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొందరు అధికారుల అనుమతితో పరిమిత సంఖ్యలో బంధువులు, స్నేహితులను ఆహ్వానించి వివాహం చేసుకుంటున్నారు. ఈటీవీ జబర్దస్త్ షోతో పాపులర్ అయిన మహేశ్ వివాహం ఈరోజు ఉదయం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన పావనిని మహేశ్ వివాహమాడారు. 
 
చాలా తక్కువ సంఖ్యలో బంధువులు, స్నేహితులు పెళ్లికి హాజరయ్యారు. వివాహం నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేశ్ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వివాహానికి హాజరు కాలేకపోయిన సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా మహేశ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. రంగస్థలం, మహానటి సినిమాల ద్వారా మహేశ్ కు మంచి గుర్తింపు వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: